Thursday, May 11, 2017

మేము ఉద్యోగస్తులము




ఆశ తప్పితే ఆవేశపడలేని, అభాగ్యులం.

తెలిసినా గొంతెత్తి పలకలేని మౌన మునులం.

కాలం తో పాటుగా సాగిపోవడం తప్ప సాహసించి ఎదురు తిరగలేని సామాన్యులం.

సగటున అందరం జీతం కోసం ఎదురు చూసే జీవచ్చవాలం.

భద్రత పేరుతో భవిష్యత్తుని ఫణంగా పెట్టేస్తాం.

పదేళ్లకొకసారి వచ్చే వేతన సవరణ కోసం పడిగాపులు కాస్తాం.

బదిలీ అంటే బాధ్యతయుతంగా బయలుదేరుతాం, మా బాధ్యతలకు భగవంతుడి మీద భారం పెడతాం.

మమ్మల్ని కన్న వాళ్ళని మేము మరచిపోయాం, మేము కన్నా వాళ్ళు మమ్మల్ని మరిచిపోయారు,

ఎందుకంటే మేము ఉద్యోగులం మాకు బంధాల కన్నా, బాధ్యతలు ముఖ్యం.

ఐదేళ్లకు వచ్చేవాడు ప్రతి వాడు అధికారం చూపిస్తాడు,అవహేళన చేస్తాడు.

పన్నులు తప్పనిసరిగా చెల్లిస్తాం, మా బాధ్యత నిర్వర్తిస్తాం, హక్కులు అడిగితే అణగారి పోతాం.

వేతన సవరణ కోసం ఆలోచిస్తు త్రిశంకు స్వర్గంలో బ్రతికేస్తాం, ఆశించినది రాక పోయిన అమలులోకి వచ్చిన దానితో యధావిధిగా సర్దుకుపోతాం.

ఎందుకంటే మేము ఉద్యోగస్తులం

4 comments:

Unknown said...

చాలా బాగుంది... సగటు ప్రభుత్వ ఉద్యోగి ఆలోచన, ఆవేదన మరియు ఆశను ప్రతిభింబించావు...

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

ధన్యవాదాలు

Unknown said...

Bagundi Annayya

శ్రీ ( జనార్ధన శ్రీనివాస రెడ్ది ) said...

ధన్యవాదాలు రా....