Saturday, August 19, 2017

మన దేశం



ఏమైంది మన స్వాతంత్ర సమరయోదుల త్యాగఫలం...
 

ఏమైంది మన దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయం...

నిస్సిగ్గుగా, నీతి లేకుండా దోచేస్తున్న అధికారుల కనుసన్నలలో కనుమరుగై పోయిందా …

శ్వేత వర్ణ వస్త్రాలలో స్వేచ్ఛగా, అనైతికంగా అక్రమాలకు పాల్పడుతున్న వారి పాదక్రాంత మైపోయిందా…

మౌన నిద్రలో ఉన్న మేధావుల మేధస్సులో మసకబారి పోయిందా…

ఇక్కడ మన మేధావులు ఒక్కరు, పరాయి దేశాలలో ముగ్గురికి సమానం

మానవ వనరులలో ప్రపంచదేశాలలో ప్రధమస్థానం అయినా గత 70 యేళ్ళుగా ఆభివృద్ధి చెందుతూనే ఉన్నాము...

అలీన విధానానికి ఆయువుపట్టు మనము, పంచవర్ష ప్రణాళికలకు ప్రాకారం మనము అయినా ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు...

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినా విద్యా, వైద్యం సామాన్యుడికి అందని ఆశనిపాతం...

ప్రపంచ ధనవంతుల జాబితాలో మనవాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికి 23 కోట్ల మంది ఒంటిపూట మాత్రమే తినగలిగే స్థోమత...

ప్రపంచ మేధావుల జాబితాలో మనవాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికి 20 శాతం మంది నిరక్షరాస్యులు గానే ఉన్నాము...

ఎన్నాళ్ళు ఇలా, ఎన్నేళ్ళు ఇలా నల్లధనాన్ని నామరూపాలు లేకుండా చెయ్యలేమా...

నిర్వీర్యం అయిపోతున్న విద్యావ్యవస్థను , మసకబారిపోతున్న యువత భవిష్యత్తును , లంచాగొండి తనము, కుల,మత,ప్రాంతీయ,బంధుప్రీతి వివక్షలను మార్చలేమా....

తప్పుకు తగిన కఠినమైన తక్షణ శిక్షలు అమలుపరచలేమా, ప్రాధమిక హక్కులు,విధులు సక్రమముగా నిర్వర్తిన్చాలేమా…

అప్పుడే అవుతుంది మన దేశం ఈ ప్రపంచానికి దిక్శుచి, పూర్వవైభానికి వాస్తవరూపం....

No comments: