మొదటిసారి మద్యాహ్నము 3.00 గంటలకు ఆఫీస్వదిలేస్తున్నారు అంటే చిన్న వర్షము పడినప్పుడు స్కూల్వదిలేసిన రోజులు గుర్తొచ్చి నవ్వుకున్నాను.
“ Heart of the City - Anna nagar” అని విన్న నేను,వర్షపు తాకిడికి ఇదే ఇంతలాగా వణికి పోతుంటే మరిమిగతా ప్రాంతాల దుస్థితి ఉహించటానికే భయంగాఉంది.
అంతలోనే whatsapp లో తెలిసింది విమానరాకపోకలు ఆపేసారని... అదే ఉధృతమైన వర్షం వల్ల
అంతలో కరంటు పోయింది సుమారు సాయంత్రం 6.00గంటలకు, ఇప్పటికీ రాలేదు.. దాదాపు 14.00 గంటలుతరువాత కూడా... మరి ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే...
రాత్రికి భోజనం చేద్దామని గెస్ట్ హౌస్ కి వెళ్దాంఅనుకుంటే వెళ్ళే పరిస్టితి లేదు. మోకాళ్ళువరకు నీళ్ళు,దీనికి కారణము కూడా ధారాపాతము గా కురుస్తున్న ఆవర్షమే.
బ్రతుకు జీవుడా అని అతి కష్టం మీద బయటపడిఎదురుగా ఉన్న కొట్టులో ఏదో తిని, ఓ మూడు బిస్కట్ప్యాకెట్లు తీసుకొని రూమ్ కి వచ్చి పడుకున్నాను,తెల్లవారి అయినా తెరిపి ఇస్తుందా అని ఏదోచిన్నఆశతో...
యధావిధిగా 6.00 గంటలకు అలారం మ్రోగింది,అప్రయత్నం గానే నిదురలోంచి లేచి, బయట ఒక్కసారిచూస్తే , నా కళ్ళు నేనే నమ్మలేనట్లు నేను అన్ననగర్ లోఉన్నానా లేక అండమాన్ లోనా అని.
మొబైల్ లో ఛార్జింగ్ లేదు, ఇంటిలో పవర్ లేదు, ఆకలివెయ్యకా మానదు...
ఈ పరిస్థితికి కారణము పాలకుల పట్టింపు లేని తనము,అధికారుల అధత్వము, ప్రజల స్వార్ధము, కొలనులను,జలపాతాలను,సెలయేరులను, కొండలను, గుట్టలనుఒక్కటేమిటి కంటికి కనిపించిన ప్రతి ఒక్కటి మనసొంతం చేసుకోవాలనే పిచ్చితత్వము
నాడు కబ్జ్జా చేసిన కొలనులు, సెలయేరులో వెళ్ళవలసిననీళ్ళు , వర్షాలు వచ్చిన్నప్పుడు నేడు కోలనిలోకివస్తున్నాయి, మనిషి మారిపోయాడు ప్రతిదిదోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నాడు, పాపంప్రకృతికి ఇవేమీ తెలియవు, నీరు పల్లానికిప్రవహించాలన్న తన సహజత్వమును తప్ప...
ఏకధాటిగా కురుస్తున్న వాన, డ్యాము గేట్లు ఎత్తేస్తాముఅన్న అధికారుల ప్రతిపాదన, అర్ధరాత్రి , నిషిది చీకటిలోజలమైమైన వీధులు, సంచరించడమే సాహసముగాభావించవలసిన వైనము
రెండు రోజులు ఆధునికయుగంలో విద్యుత్తు లేకుండా గడపడము, నాలుగుగోడల గది, రెండు పగలు,రెండు రాత్రులు, ఛార్జింగ్ లేనిమొబైల్,పవర్ లేని ప్లగ్ లు , చదువుకోటానికి రెండుపుస్తకాలు, రాసుకోటానికి ఒక నోట్ పాడ్ , క్రమముతప్పని ఆకలి...
మానవత్వానికి బాషలేదని,ఒకరికి ఒకరు సాయముచేసుకోటానికి ఒకేరాష్ట్రము కానక్కరలేదని, గ్రౌండ్ ఫ్లోర్లో తడిసిన సామాన్లుతో ఉండలేక, నా రూమ్ లో సేదతీరటానికి నన్ను అడగలేక మొహమాట పడుతున్న ఇంటి యజమాని మరియు ఆతని కుటుంబము, అదిచూసి నేనే వారిని పైకిరమ్మన్నాను, సమయానుసారముగా వారితో పాటుగా నాకు ఆహారాన్ని అందిస్తూ, నా బాగోగులుచూసుకుంటున్నారు. మొహమాటము తో వారుచేస్తుంది కాదనలేక, వేరే దారి లేక అనుసరిస్తున్న నేను...
అప్పుడు అర్ధము అయింది, ఋణాను బంధం అంటే పక్కనే అదే నగరంలో ఉన్న చెల్లిని కలవలేకపోయాను, నాకోసం ఎదురుచూస్తున్న తల్లితో, భార్యతో మాట్లాడలేకపోయాను, అంతెందుకు రెండు అడుగుల దూరంలోఉన్న గెస్ట్ హౌస్ కి కూడా చేరుకోలేకపోయాను, ఆ రెండురోజులు నాకు కుటుంబము,ఆత్మీయులు అన్ని అన్నివాళ్ళే నాతోపాటుగా గడిపిన ఆ తమిళ కుటుంబం...
నా జీవిత కాలములో నేను మరిచిపోలేని అతి కొద్దిరోజుల్లో నాకు తెలియకుండా నానుంచి చెన్నై నగరం వర్షం దోచుకున్న రెండు రోజులు(ఫ్రొం 2.12.2015 తొ3.12.2015) ఎప్పటికి మరచిపోలేను. ఎప్పుడు టీవీలోవరదలు,వర్షాలు అంటే చూడడమే గాని ప్రత్యక్షంగాఅనుభవిస్తే తెలిసింది నరకం అంటే ఏమిటి అని, అయినవారితో మాట్లాడలేను, ఆప్యాయముగా పలకరించేవారిని చేరుకోలేను, అసలు చేరుకుంటానో లేదోతెలియదు, దానికితోడు పడుకుంటే భయపెట్టే భయానకకలలు, ఇలాంటి రోజులు పగవాడికి కూడా రాకూడదు

