Thursday, May 11, 2017

నీవే ...నీవే ...





మౌనం నీవే మాటవు నీవే నా మదిలో మెదిలే భావం నీవే

ఉహవు నీవే ఊసులు నీవే నా కన్నుల్లో కదిలే కలవు నీవే

నీ కోసము నేనున్నాను అని నన్ను నడిపించే స్నేహం నీవే

నా కోసం అనుక్షణం ఆలోచించే   నా ఆత్మబంధం నీవే


ఏ దూరాన ఉన్న నా గుండె చప్పుడు జాడీలో ఒదిగివుంది నీవే

నిరంతరం నన్ను నన్నుగా  మేల్కొల్పే వేకువ నీవే

అనుక్షణం నన్ను ఆహ్లాదంగా తాకుతు నన్ను నేను మరిచేటట్లు చేసింది నీవే

ప్రతిక్షణం ప్రేరణ ఇస్తూ నన్ను నడిపించేది నీవే
 
 
నీ కోసం ఆలోచించే ప్రతిక్షణం నన్ను నేను మరిచిపోతాను

నా కోసం  ఆలోచించే ప్రతి క్షణం నీతో నిండి పోతాను

 నే ఒంటరిగా ఉన్న, నలుగురితో ఉన్న ని ఆలోచనలే 

జంటగా మనం గడిపిన  జ్ఞాపకాల చిరుజల్లుల పులకింతలే

మేము ఉద్యోగస్తులము




ఆశ తప్పితే ఆవేశపడలేని, అభాగ్యులం.

తెలిసినా గొంతెత్తి పలకలేని మౌన మునులం.

కాలం తో పాటుగా సాగిపోవడం తప్ప సాహసించి ఎదురు తిరగలేని సామాన్యులం.

సగటున అందరం జీతం కోసం ఎదురు చూసే జీవచ్చవాలం.

భద్రత పేరుతో భవిష్యత్తుని ఫణంగా పెట్టేస్తాం.

పదేళ్లకొకసారి వచ్చే వేతన సవరణ కోసం పడిగాపులు కాస్తాం.

బదిలీ అంటే బాధ్యతయుతంగా బయలుదేరుతాం, మా బాధ్యతలకు భగవంతుడి మీద భారం పెడతాం.

మమ్మల్ని కన్న వాళ్ళని మేము మరచిపోయాం, మేము కన్నా వాళ్ళు మమ్మల్ని మరిచిపోయారు,

ఎందుకంటే మేము ఉద్యోగులం మాకు బంధాల కన్నా, బాధ్యతలు ముఖ్యం.

ఐదేళ్లకు వచ్చేవాడు ప్రతి వాడు అధికారం చూపిస్తాడు,అవహేళన చేస్తాడు.

పన్నులు తప్పనిసరిగా చెల్లిస్తాం, మా బాధ్యత నిర్వర్తిస్తాం, హక్కులు అడిగితే అణగారి పోతాం.

వేతన సవరణ కోసం ఆలోచిస్తు త్రిశంకు స్వర్గంలో బ్రతికేస్తాం, ఆశించినది రాక పోయిన అమలులోకి వచ్చిన దానితో యధావిధిగా సర్దుకుపోతాం.

ఎందుకంటే మేము ఉద్యోగస్తులం

ఓ మనిషి




నా జననం జనం కోసం, నా మరణం మార్పు కోసం
నా జనన మరణాలు జనంలో మార్పు కోసం...
 

నా మార్గం విప్లవం, నా గమ్యం సమనత్వం
నా ధ్యేయం విప్లవంతో సమనత్వం సాధించడం...

విప్లవం అంటే కాదు విద్వంసం , విప్లవం అంటే కాదు విచక్షణా కొల్పోవడం
విప్లవం అంటే జనులందరిలో విజ్ఞతతో, వివేకాన్ని మేల్కొలపడం...

ఆకలి, దప్పికలు, అవకాశ ఆసమానతలు లేని
ఆర్హత బట్టే ఆధీకారం, శ్రమ బట్టే సౌకర్యం ఉన్న ప్రపంచం నా స్వప్నం...

ప్రకృతికి లేదు ఏ భేషాజం , వికృతుముగా ప్రవర్తిస్తుంది మనమే
చూసి నేర్చుకుందాం, ఈర్ష్య,ద్వేషాలను వదిలేద్దాం మనస్వప్నం సాధించుకుందాం...

ఈ దేహం మూడుణాల ముచ్చట , ఆదర్శంగా జీవిద్దాం
భావితరాలకు బంగారు బాట వేసి , చరిత్రలో చిరస్మరణీయులవుదాం...

ఆదర్శం అంటే కాదు మన జీవితాలను త్యాగం చెసేయ్యడం , కనిపించిన వారిని ఆప్యాయంగా
పకలరించడం , నహజ వనరాలను ఆవసరం మేరకు ఉపయోగించడం, ప్రకృతి సహజత్వం కాపాడడము,

వీలైనంత వరకు ఎదుట వారికీ సాయపడడం... 

తోటివాడు మనవాడే అనుకో, ఆర్తనాదం ఆలపించే అవకాశం ఇవ్వకు ఎవ్వరికి

కష్టం అన్నది కనిపించ నివ్వకు ని కనుచూపు మేరలో, విశ్వశాంతికి బీజం నువ్వు, వాసుదేక కుటుంబానికీ వారాసుడునువ్వు...

Sunday, May 7, 2017

మన వరాల తెలుగు


తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిచెపుతానని ఆవిర్భవించిన ప్రాంతీయ రాజకీయ పార్టీ ,అదే నినాదంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నపార్టీ , మీపార్టీ పేరును ఉచ్చరిస్తున్నప్పుడు కూడా మీకు గుర్తురాలేదా తెలుగు జాతి ఆవశ్యకత,తెలుగు బాషాప్రాముఖ్యత...

ఎందుకయ్యా తెలుగు వారంటే ఇంత చులకన ,అభివృద్ధి చేస్తున్నపుడు మేము కావాలి, అభివృద్ధిఅయిన తరువాత మేమువద్దా...

తమిళనాడు నుండి వెళ్లి పొమ్మన్నారు, మౌనంగావచ్చేసాము, హైదరాబాద్ నుండి వెళ్లి పొమ్మన్నారు,మౌనంగా వచ్చేసాము , ప్రత్యేకహోదా అన్నారు.. మీరే,మళ్లి మాట మార్చారు, అయిన సహించాం, కానీ మాతృబాషను మానుంచి దూరంచేస్తే భరించలేక పోతున్నాం,మా తల్లిని మాకు దూరం చేయకండి.

అభివృద్ధి ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాం,ఎందుకంటే ఇంత మందికి బంగారు బాటలువేసినవాళ్ళం, మాకు మేము చేసుకోలేమా ఒకనాటికి...

కానీ అమ్మనే దూరం చేస్తే అనాధలం అయిపోతాం, అన్యబాషాలో ఇమడలేక, మన బాషలో మనసు విప్పిమాట్లాడలేక, మాట్లాడేవాళ్ళు లేక పిచ్చివాళ్ళు అయిపోతాము.

అభివృద్ధి కోసం ఆంగ్లాన్ని నేర్చుకుందాం, అది అవసరంకూడా... ప్రపంచదేశాలతో మనవిద్య,వైజ్ఞానిక,వైద్య,వ్యాపార రంగాలలో పరస్పరసహాయసహకారాల కోసం...అంత మాత్రాన మనమాతృ బాషని భావితరాలకు దూరంచేసే హక్కు,అర్హతలు మీకెవరు ఇచ్చారు.

అభివృద్ధి చెందిన తరువాత అభినందించటానికి మనఅన్నవాళ్ళులేని ఆ అభివృద్ధి మనకెందుకు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లిభూమిభారతిని నిలుపరా నీ జాతి నిండుగౌరవాన్నీ అన్ననానుడి మరిచి,మీ కభంద హస్తాలతో మన జాతి గొంతును మీరే నొక్కేస్తారా.

మన పక్కరాష్ట్రాన్ని చూడండి వాళ్ళ ఒక సాంప్రదాయక్రీడను కేంద్రప్రభుత్వం నిషేదిచిందని, పార్టీలకుఅతీతంగా, రాష్ట్రప్రభుత్వం, నాయకులు, ప్రజలు ఏకమైతమ సంప్రదాయాన్ని కాపాడుకున్నారు, మరి మన వాళ్ళ ఏమో,మన మాతృభాషను సమాధి చేయటానికియుద్దప్రతిపదికిన సన్నధ్ధులవుతున్నారు.

నారా,నారాయణ లారా ఒక్కసారి పునరాలోచనచెయ్యండి,ఏ జాతి కీర్తి,ఖ్యాతి అయినా ఆ జాతి బాషామీదే ఆధారపడి ఉంటుంది, మన జాతి ఖ్యాతినిదశదిశలు ప్రసరింపజేసిన మహానుభావులు అందరూమరొక్కసారి శాశ్వతంగా మరణిస్తారు, తెలుగుచచ్చిపోయే దుస్టితే వస్తే దాని కంటే ఒక్కరోజు ముందునేను చచ్చిపోతాను అనుకున్నవారు మీసాక్షిగా మరణిస్తారు.

మీ అమ్మ,నాన్నలకి మీరు గుడి కట్టించవద్దు కానీ ఎవరోకట్టిన గుడి ముందు మాత్రం అడుకునేట్టులు చేయవద్దు అలాగే మన తేటతెలుగును కీర్తించకపోయినా పరవాలేదు కానీ, కిరాతకంగా హత్య మాత్రంచెయ్యొద్దు.

ఉగ్గుపాలతో కమ్మగా నేర్చిన కమనీయ అమ్మ బాష నాతెలుగు, నా అన్న వాళ్ళను నా నోటితో మొదటిసారిగాపిలిచిన తొట్టతొలి భాష నా తెలుగు, నేటికీ నా ఊహలకిఆశాజనకం, ఉత్ప్రేరకం నా తెలుగుబాష.

మన తెలుగు జాతి, సంస్కృతికి,సంప్రదాయాలకు,చరిత్రకు చిహ్నంగా ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మిస్తానని, వాటికి మూలం అయిన తెలుగు భాషనే సమ్ములనంగా సర్వనాశనం చేసేద్దాము అనుకుంటున్నారా

విద్య లేని వాడు వింత పశువు అని నాడు నానుడి , తెలుగు చదివిన వాడు చేవాలేని వాడు అని మన అమాత్యులు నేడు సృష్టిస్తున్నారు కొత్త నానుడి

చివరిగా ఒక మాట ఇంత మంది భాష కోసం భావోద్వేగాలతో చెప్తున్నా వదిలేయండి, ఒక్కసారి మీ కళ్లు మూసుకుని , గుండెమీద చేయిపెట్టి మీ ఆత్మ సాక్షిని అడగండి ,అప్పటికి చేయాలనుకుంటే మీకన్నా జాతి ద్రోహులు , చరిత్రహీనులు మరొక్కరుండరు...ఇది తథ్యం, ఇది తథ్యం.

ఇప్పటికి మించిపోయింది ఏమీలేదు...

అమాత్యులారా,మరొక్కసారి ఆలోచించండి, మన అమ్మ భాష ను ఆదరించండి.

ఒక తెలుగు భాషాభిమాని...

Friday, May 5, 2017

బాహుబలి


కీర్తి , ప్రతిష్టలకు పరాకాష్ట...

విమర్శకుల అంచనాలకే అందనంత దూరం...

ఆభరణాలకు, అహ్హర్యానికి, అభినయాలకు ఖచ్చిత నిర్వచనం

భారతీయ సినీ జగత్తులో మరో మకుటం లేని మహారాజు...

ఎన్నో అభినందనలు, ఎన్నోపొగడ్తలు,వాటితో పాటు కిట్టని వారు చేసే కొన్ని విమర్శలు...

అభినందనలు, పొగడ్తలు కోసం చెప్పవలసిన అవసరం లేదు.

ఒక కథానాయకుడి అకుంటిత దీక్షకు, ఒక అలుపెరుగని దర్శకుడి సృజనాత్మకతకు, పాత్రల ఎన్నికకు , కథ,కథనాలు నడిపిన తీరుకి , సందర్భోచిత సంభాషణలకు, దృశ్య కావ్యంగా మలిచిన వైనానికి,   

ఒక సాధారణ కథను , అసాదారణ చిత్రంగా రూపుదిద్దిన శ్రమ, పట్టుదలలకి దక్కిన గౌరవం ఈ చిత్ర అఖండవిజయం...

నాయకి నాయకులు,ప్రతినాయకుడు ఒక్కటేమిటి ప్రతి పాత్ర శరీర దారుడ్యం ,హావభావాలు, సంభాషణలు, నటన మీద పెట్టిన శ్రద్ధ అన్నిఅద్భుతం... వాటికి ఈవిజయమే నిదర్శనం.

ఇక పోతే విమర్శలు చూద్దాం...

ఇది మామూలు కథే:- అవును ఇది మామూలు కథె అని రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు,

మనం ఏ కధ చెప్పినా మహాభారతం,రామాయణం,భాగవతం ఈ మూడింటిలో లేని కధ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు అని.

అలా అనుకున్నపుడు మీరే తిసేయవలసింది కదా సినిమా.



అనుకరణ (కాపీ) చేసారు:- అవును అనుకరించి దానిని ఇంకాస్త మెరుగుపరిచి చూపించడం తప్పులేదుకదా , IIT Chennai లో ఇదే విషయం పై రాజమౌళిగారు బాహుబలి 1 విజయం తరువాత విద్యార్దులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.


దక్షిణ భారతదేశం సినిమా:- ఎందుకయ్యా సినిమాలు సినిమాలుగా కాకుండా ప్రాంతాల వారిగా, భాషా ప్రతిపాదికిన చూస్తారు, మీరు చేసిన మంచి సినిమాలు మేము ఎంతగానో ఆదరించాం, ఎంతో మంది నటీనటులు ఉత్తర భారతదేశం వచ్చి ఇక్కడ నటించలేదా, మీరు ఆదరించలేదా , ఇప్పుడు ఎందుకు ఈ భేషజాలు.

ఎవరో ఒక ఉత్తర భారతదేశ ప్రముఖ వ్యక్తి  బాహుబలి ఈఈ కోసం ఏవో విమర్శలు చేశారు అని ప్రచార మాధ్యమాల్లో వస్తే చూసి , ఎవరా అతను అని గూగుల్లో శోధిస్తే తెలిసింది... అతని కోసం ప్రస్తావించక పోతేనే మంచిదని.

చివరిగా ఇది తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిన ఒక అద్భుతమైన చిత్రరాజం , ఇలాంటివి మరెన్నోచిత్రాలు రావటానికి దిక్సూచి.

ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమించి, నిర్మించి మన కళ్లకు ఒక మహా అద్భుతానన్ని ఆవిష్కరించిన 24 విభాగాల్లో పనిచేసిన అందరికీ  అభినందనాలు తెలుపుతూ

ఒక సగటు ప్రేక్షకుడిని... 

Thursday, May 4, 2017

కళాతపస్వి మన విశ్వనాధుడు


కళాతపస్వి మన విశ్వనాధుడు


తెలుగు సిని జగత్తులో పరిచయం అక్కరలేని అతి కొద్దిమందిలో ఒక్కరు
తన కథ, కథనాలు తో ఎంతో మందిని గొప్ప కదానాయకులు గా మార్చిన

ఎంతో మందికి కొత్త ఇంటి పేరును తన సినిమాలతో చేర్చిన 
(శుభలేఖ సుధాకర్, శంకర భరణం శంకరశాస్త్రి, సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదలగు...)

కదానాయకుడు ఎవ్వరూ అని కాదు, కథ, కథనం తో చిత్రాన్ని విజయపథంలో నడిపించవచ్చు అని రుజువు చేసిన

తెలుగు సినీ జగత్తుకు తరగని సాహిత్య ఘనిని, మన సిరివెన్నెలను మనకు పరిచయం చేసిన

ఒక కళాకారుడి జీవితంలో అలాంటి ఒక చిత్రంలో నటించాలన్న, తీయలన్న కోరిక నెరవేరని రోజుల్లో, ఆలాంటి అద్భుత చిత్రాలను పదుల సంఖ్యలో ఆవలీలగా తీసి మెప్పించిన

తనకు పోటీ మరియు సమకాలికులు అయిన వారి దగ్గర సాయకుడిగా పనిచేయాలనే కోరికను వ్యాక్తపరిచి , తనకు ఇంకా నేర్చుకోవాలనే జిజ్ఞాసకు , పని మీద ఉన్న ప్రేమకు , ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలనే నిదర్శనం అయి నిలిచినా

అవార్డులు,రివార్డులు వల్ల వక్తి ఉన్నతిని బేరీజువేస్తున్నా ఈరోజుల్లో, వాటికే విలువ పెంచిన విశేష వక్తిత్వము చూపించినా

కన్నా తల్లికి , మాతృ భూమికి దూరంగా ఉంటూ వారు గుర్తొచ్చినప్పుడు ఏమి చెయ్యలా ఆని ఆలోచిస్తున్నా తరుణంలో , అతని చిత్రాలు చూసిన , పాటలు విన్నా , నాదేశం మట్టి మీద, నాతల్లీ ఓడిలో ఉన్న అనుభూతిని కల్గించగాల్గిన

కులం కన్నా వ్యక్తి, వ్యక్తిత్వం గొప్పదని “సప్తపది” లో చెప్పిన

ప్రేరణ ఉంటె ఏదైనా సాదించటానికి అవిటితనానికి కూడా హద్దులు ఉండవని “ సిరివెన్నల “ లో చెప్పిన

వ్యక్తిత్వం , విలువలు ఉంటే హోదాలతో పనిలేదని “ శుభలేఖ” లో చెప్పిన

ఉన్నత స్టానం పొందిన, ఈర్ష్య , ద్వేషాలు విడువక పొతే ఆంధ్పతలనికి వెళ్లిపోతారని “ స్వాతికిరణం” లో చెప్పిన

అన్నదమ్ముల బంధాన్ని,ఒకరికి ఒకరు ఆసరా,అవస్యకతలను “ స్వరాభిషేకం” లో చెప్పిన

తనను నమ్మే యజమాని కోసం , తనను ఇష్టపడే సేవకుడు ఎలా ఉండాలి అని “ శుభసంకల్పం” లో చెప్పిన

ఇలా ఎన్నోచెప్పాలి అనుకున్నావి నిస్కార్సగా , సున్నితంగా ,సాహిత్య,సంగీత సమ్మేళనంతో పండిత,పామర జనరంజకంగా చెప్పగలిగినా మన కళాతపస్వికి దాదా సాహెబ్ పాల్కే ఆవార్డ్ వచ్చిన సందర్బముగా  శిరస్సు వంచి , నమసుమజంలి గటిస్తూ , హృదయపూర్వక  అభినందనాలు తెలుపుతూ......